అందరి నాయకా ! అందుకో ఈ లేఖ

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరిది ? దాని హక్కుదారులెవరు ?

తెలంగాణ రాష్ట్రం ఎవరిది ? దాని హక్కుదారులెవరు ?


ఈ రెంటికీ ఒకటే సమాధానం...

ఇంకెవరు !!!  ప్రజలే.

భౌగోళికంగా విడిపోయినా ఏటికి అటున్నదీ, ఇటున్నదీ తెలుగు ప్రజలే. వారి మధ్య నైతిక, సామాజిక, వైవాహిక, వాణిజ్య, సాంస్కృతిక... తదితర సంబంధాలన్నీ దాదాపు సాధారణ స్థితికి చేరుకుని భవిష్యత్ జీవితాలను మరింత మెరుగు పరుచుకోవాలని వారు ఉవ్వీళ్ళూరుతున్న ప్రస్తుత తరుణంలో...

చిక్కుముళ్ళను...

రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన చిక్కుముళ్ళను, పీటముళ్ళను విప్పదీసే ప్రయత్నానికి ముఖ్యమంత్రులు పూనుకోవడం హర్షించదగిన పరిణామమే అయినా... 

శనివారం, జులై 6, 2024న మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి చర్చలు ప్రారంభించిన సన్నివేశం 

కొన్ని నైతిక, మౌలిక ప్రశ్నలను సంధిస్తున్నది.

·        ఈ ఆస్తుల పంపకాల చర్చలకు ప్రాతినిథ్యం ఎవరు వహించాలి ?

·        ఏ ఒక్క ప్రాంతమూ, ఏ ఒక్క వర్గమూ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది ?


ఈ రెంటికీ ఒకటే సమాధానం...

శాసనసభలకు, పార్లమెంటుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న  ప్రతి ఒక్కరితోపాటూ, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఉద్యమ సమయంలో రెండు పక్షాల్లో చురుకైన పాత్ర పోషించిన అన్ని రాజకీయపక్షాల నాయకులు, ప్రజాసంఘాలు, మేధావులు కూడా ప్రాతినిధ్యం వహించాలి, బాధ్యత తీసుకోవాలి కూడా.


ఏరీ ! వారేరీ !!!

నిన్నిటి చర్చల్లో ఏరీ... వారేరీ !!! ఎక్కడా కనిపించలేదేం !!! వినిపించలేదేం !!!

ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రతిపక్షసభ్యులు కానీ, నాయకులు కానీ వారి వారి గుహల్లోంచి తొంగిచూడకపోవడమేమిటి !! అధికారం చేతికి అప్పగిస్తేనే ప్రజల పక్షాన పోరాడతారా !!! రాజకీయంగా రచ్చ చేయడానికి ప్రతిరోజూ ఓ నలుగురిని పోగేసుకుని టివి కెమెరాలముందు ఊరేగడానికి, ఆక్రోశించడానికి ఉన్న తీరిక... ఈ చర్చల్లో తమ వంతు పాత్ర పోషించడానికి ఎందుకు లేకపోయింది !!!!

 

ఆ సోయి వారికి కూడా లేదేం !!!!

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వాటాలు, పంపకాలకు కూర్చుందామని నిర్ణయించుకున్న రెండు రాష్ట్రాల అధికార పక్షాలు ఇది వారి స్వంత పార్టీలకు, వారి ప్రభుత్వాలకు పరిమితం చేస్తే సరిపోతుందా !!!

ఈ చర్చల్లో ప్రత్యక్షంగా కూర్చోబెట్టాల్సిన అవసరం లేకపోయినా సలహాలు, సంప్రదింపులకు రెండు రాష్ట్రాల్లో ఎన్నికయిన ప్రజాప్రతినిధులను, మేధావులను, ప్రజా సంఘాలను కలుపుకుపోయే దిశగా అడుగులు పడిందెక్కడ ?


ఇకనయినా...

ఇప్పటికయినా మించిపోయిందేమీ లేదు. అధికారుల స్థాయిలో, ముఖ్యమంత్రులస్థాయిలో తీర్మానాలు మాత్రమే చేయండి. నిర్ణయాలు తీసుకోకండి. చట్ట సభలను ప్రత్యేకంగా సమావేశపరచండి. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి మేధావులనూ భాగస్వాములను చేయండి...


ఇది ఇప్పటికిప్పుడు ఎందుకు చెప్పాల్సివస్తున్నదంటే....


పునర్వవిభజన చట్టం తాలూకు పంపకాలు-చిక్కుముళ్ళు...

ఇక్కడి రాజకీయ పార్టీలకు సృష్టిస్తున్న అవకాశాలు అపారం


·        కాంగ్రెస్ పార్టీకి.... సోనియామీద కోపం కొద్దీ కాంగ్రెసును మట్టికరిపించిన  ఆ గట్టున కూడా మళ్ళీ కాంగ్రెస్ పంట పండించి అధిష్ఠానానికి మరింత చేరువ కావడానికి రేవంత్ రెడ్డికి ఇదొక అందివచ్చిన అవకాశం (కానీ గురుద్రోహం అవుతుందనే భయం)

·        తెలుగు దేశానికి... కేసిఆర్ కొట్టిన చావుదెబ్బతో కనుమరుగయిన తెలుగుదేశాన్ని తిరిగి తెలంగాణలో బతికించుకోవడానికి  చంద్రబాబుకు ఇదొక సువర్ణావకాశం (కానీ ప్రియ శిష్యుడిమీద కత్తిదూయడమెలాగా అని సందిగ్ధం)

·        భారతీయ రాష్ట్ర సమితికి... పంపకాలు ఎలాగూ ఉభయులనూ పూర్తిగా సంతృప్తిపరచలేవు గాబట్టి... గడ్డిపోచంత ఆధారం దొరికినా చాలు సెంటిమెంటు రగిల్చి  బతికి బట్టకట్టడానికి  కేసిఆర్ పార్టీకి   ఇది కలిసొచ్చిన అవకాశం...

·        వైఎస్సార్ సిపికి... తెలంగాణలో దూరే అవకాశం ఎలాగూ లేదు... ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నారనే నినాదంతో  తలెత్తుకుని తిరగడానికి జగన్ కు దేవుడిచ్చిన అవకాశం...

·        భారతీయ జనతాపార్టీకి... కాషాయానికి దక్షిణాదిన కషాయమే అనుకున్న చోట... కాలోవేలో మోపేంత స్థలం దొరికితే అరబ్బీ ఒంటెలాగా గుడారంలోకి పూర్తిగా దూరిపోవాలని చూస్తున్న సమయంలో... రెండు రాష్ట్రాలు పిలిచి అందిస్తున్న అవకాశం....

ఈ పరిస్థితుల్లో  రాజకీయ పార్టీల స్వార్థాలకు బలికాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూర్తి న్యాయం జరగాలంటే... మేధావులు, ప్రజా సంఘాలు సహా అని పక్షాల  అంగీకారంతోనే  నిర్ణయాలు జరగడం ఉత్తమం.


-ములుగు రాజేశ్వర రావు, సీనియర్ జర్నలిస్టు.


OPEN LETTER TO THE CHIEF MINISTERS OF TWO TELUGU STATES

 

A N   O P E N   L E T T E R TO 

THE CHIEF MINISTERS’ OF TWO TELUGU STATES



తెలుగు రాజ్యాల ప్రభువులు

శ్రీ చంద్రబాబు నాయుడు,  శ్రీ రేవంత్ రెడ్డి గార్లకు

బహిరంగ లేఖ

...

Treat this as Important & Urgent

 

అమ్మను పంచుకోకండి

 

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం.. జులై 6, 2024న సమావేశమై ఆస్తిపాస్తుల వాటాల వివాదాలను పరిష్కరించుకోవడానికి నడుంబిగిస్తున్న శుభ ఘడియల్లో....

అనంతకోటి తెలుగు ప్రజల తరఫున సవినయంగా సమర్పించుకుంటున్న విన్నపం...

 

అయ్యలారా !!!!!!!!!!

 

మీరు ఆస్తిపాస్తుల పంపకాల గురించి మాట్లాడుకునే ముందు మన తల్లిభాష ... తెలుగు ఆరోగ్యం గురించి  వాకబు చేయండి. కాటికి కాళ్ళు చాపుకుంటున్న సమయంలో ఆమె ముంగిట వేరు కుంపట్లు వచ్చాయి. అది లోక సహజమే అయినా ఆస్తిపాస్తులన్నీ అనదమ్ములిద్దరూ మీమీ రాజకీయ చతురతతో ఏ పక్షాన్నీ నొప్పించక మీ ఇష్టం వచ్చినట్లు పంచండి.

 

కానీ అమ్మను ముక్కలు చేసి పంచకండి. అమ్మ కట్టుకున్న బట్టలు, పెట్టుకున్న నగానట్రా ఇవి నేను పెట్టినవంటే నేను పెట్టినవని పంతాలకుపోయి ఊడబెరుక్కుపోకండి.

 

ప్రాంతాలు, ఉప ప్రాంతాల్లో కొద్దిపాటి తేడాలున్నా తెలుగు వారందరిదీ ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఆచార వ్యవహారం, ఒకే సంప్రదాయం. ఇవన్నీ తెలుగు వారి ఉమ్మడి ఆస్తి అని   భావించండి.  పంపకాలకు పెట్టకండి. ఉమ్మడిగా కలిసి అనుభవించడం ద్వారా మాత్రమే తెలుగు వెలుగుతుంది. సంస్కృతి మరింత ప్రభవిస్తుంది.

 

అందువల్ల దయచేసి వీటి తాలూకు వేదికలయిన విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు, పురావస్తు భాండాగారాలు, అకాడమీలు, భాషా సంఘాలు, సాంస్కృతిక సంఘాలు... తదితరాలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి ఏం చేయాలో చర్చించండి. అలాగే దీన్ని చర్చకు పెట్టండి.

 

నిజానికి మాతృభూములు ఇవే అయినా ఈ రోజున ప్రపంచ దేశాలన్నింటా తెలుగువాళ్లు జెండాలు ఎగరేస్తున్నారు. జన్మభూమినుంచి ఎటువంటి ప్రోత్సాహం అందకపోయినా.. తెలుగు వాళ్లమని గర్విస్తూ ప్రవాసాంధ్రులు  మాతృభూమికంటే మిన్నగా భాషాసంస్కృతుల పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తూ వాటిని బతికించడానికి నానాపాట్లు పడుతున్నారు.. వీరి సంఖ్య కోట్లల్లోనే ఉంది.(350 విదేశీ భాషలున్న ఒక్క అమెరికాలోనే తెలుగువారు 11వ స్థానంలో, కేవలం భారతీయ భాషలనే తీసుకుంటే తెలుగువారు 3వ స్థానంలో వెలిగిపోతున్నారు అక్కడ )

 

అందువల్ల అందరి అభిప్రాయాలు సేకరించి, రెండు తెలుగు రాష్ట్రాల భాషా నిపుణులకు, ప్రవాసాంధ్రులకు సముచిత  ప్రాతినిధ్యం, ఇతర ప్రోత్సాహకాలతో ఉమ్మడి వేదికల దిశగా అడుగులు వేయండి. తక్షణ పరిశీలనపట్ల ఆసక్తి ఉంటే దీనికి సంబంధించిన విశ్లేషణలు, సూచనల లింక్ లు కింద ఇస్తున్నాను. తెలుగు భాషాభిమానులందరి అభిప్రాయాలు అందేవరకు వీటిని పరిశీలించి ... చివరగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను అందించి తెలుగు భాషాసంస్కృతులు  మరో వెయ్యేళ్ళు వర్దిల్లేలా  శాశ్వత పరిష్కారాలు చూపండి.

 

ఇట్లు

ములుగు రాజేశ్వర రావు,

సీనియర్ జర్నలిస్టు

................

మనవి :

సామాజిక మాధ్యమాలలోని మిత్రులకు, తెలుగు భాషాభిమానులకు, భాషా నిపుణులకు ఒక మనవి.

ఈ ప్రయత్నం మీకు నచ్చితే వీలయినంత మందిని ఈ దిశగా కదిలించండి, అధినాయకుల్లో, వారి ప్రభుత్వాల్లో  కదలిక వచ్చేవరకూ....

.....

 

ఇది నా నూలుపోగు... మరి మీదో...!!!

 

 

మిత్రులకు,

నమస్కారం... తెలుగు భాషకు ఏదో అయిపోతున్నదని అందరం ఏదో ఒక సందర్భంలో విపరీతంగా ఆందోళన పడిపోవడం.. ఆ తరవాత మన బతుకుపోరాటంలో దానిని పక్కనబెట్టడం ఎన్నో ఏళ్ళుగా జరుగుతూ పోతున్నది. కొంతమంది మాత్రం ఉడతాభక్తిగా మాటలతోనో, ఆవేదనను ప్రకటించో సరిపెట్టకుండా... వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత పదవుల్లో, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లు వారికి చేతనయినంత వారు చేస్తుంటే... మిగిలిన వాళ్లు ... గడ్డిపోచంతయినా వారి పరిధిలో వారు వారి ప్రయత్నాలు చేసుకుపోతున్నారు, మా వెనుక ఎంత మంది వస్తున్నారని చూడకుండా ముందుకెడుతున్నారు..... వారి నుంచి స్ఫూర్తిపొంది నేను కూడా నా వంతుగా వారి శ్రమలో వెంట్రుకవాసంత చేసినా మంచిదని  దీనికి పూనుకున్నా... ఈ క్రమంలో నేను ముందు ప్రస్తుతం  భాషగా తెలుగు ఎదుర్కొంటున్న పరిస్థితిని విశ్లేషించి, నాకు తోచిన పరిష్కారాలు సూచించాను...


 ఇప్పటికే నా బ్లాగు ద్వారా వీటిని మీ ముందుంచినప్పడు... పలువురు నన్ను అభినందించారు... కానీ నేను ఆశించింది అభినందనలు కాదు... ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దీనిని చర్చిస్తూ... వాటికి ఒక మంచి ఆచరణాత్మక ముగింపు ఇస్తే బాగుంటుందని ఆశించాను...  పొద్దున లేస్తే పనికి వచ్చే అంశాలతో పాటూ, ఎన్నో పనికిమాలిన వ్యాపకాలకు కూడా మనం అలవాటు పడి ఉన్నాం... వాటిలో భాగంగా... దీనిమీద కూడా మనలో ప్రతి ఒక్కరం ఎంతో కొంత శ్రద్ధ చూపితే... అది క్రమేణా వ్యవస్థీకృతం అయి మనకు సానుకూల ఫలితాలను తెచ్చిపెడుతుంది....


నాకు తోచిన పరిష్కారాలు ఇవిగో....పూర్తిగా చదవండి... మీ అభిప్రాయాలు కూడా తెలపండి. 

తెలుగు భాషాభివృద్ధికి మౌలికంగా మూడు స్థాయిల్లో సంస్కరణలకు తక్షణం శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది.


1.              తెలుగులో తెలుగు తగ్గి పరాయి భాషలు ఎక్కువగా జొరబడడాన్ని తగ్గించడం ... ... అంటే ... తెలుగులో తెలుగు పదాల వాడకాన్ని పెంచడం.


2.              వీలయినంత త్వరగా కనీస ప్రమాణాలతో (భాషా దోషాలు, వ్యాకరణ దోషాలు తగ్గించుకుంటూ) తెలుగు రచనలు, ప్రచురణల్లో ...ముఖ్యంగా తెలుగు పత్రికలు, ప్రచార సాధనాల్లో   భాష  సవ్యంగా సాగేటట్లు చూడడం.


3.              తెలుగు భాష, సాహిత్యం సుసంపన్నంగా, నిత్య నూతనంగా ప్రవహించడానికి అవసరమయిన జవసత్వాలు  శాశ్వత ప్రాతిపదికన చేకూర్చడం.


తెలుగు పదాల వాడకం :

సాంకేతికత అభివృద్ది చెందుతున్న కొద్దీ ప్రజల జీవనశైలి కూడా వేగం పుంజుకుంటున్నది. ఆ వేగానికి తగ్గట్టుగా ప్రజలు తమ పంథాను మార్చుకుంటున్నట్లే... భాష కూడా ఆ వేగానికి తగ్గట్లుగా తనను తాను మలచుకోవాలి. భాషలో ఈ మార్పు రావాలంటే....

ఇది ఎంత పండితుడయినా  ఏ ఒక్క వ్యక్తి ద్వారానో,  ఓ చిన్న నిపుణుల సమూహాల ద్వారానో,  సంస్కరాణాభిలాష ఉన్న ఏ ఒక్క సంస్థ ద్వారానో ...  భాషలో ఆశించిన  మార్పులు ఏకపక్షంగా రావు, రాకూడదు కూడా.

తెలుగు భాషలోకి పర భాషా పదం స్థానంలో  అనువాదంగా కానీ, అనుసరణగా కానీ, లేదా నిర్దిష్టమైన ఒక ప్రయోజనానికి/భావనకు ఇప్పటి వరకు వాడని  ఒక కొత్త తెలుగు పదం వచ్చి చేరాలంటే దానికి ప్రజల ఆమోదం ఉండాలి. భాషా నిపుణుల ఆమోదం ఉండాలి, సమాజంలోని , ప్రభుత్వంలోని వ్యవస్థలు సమ్మతించాలి. అప్పుడే అది సాధికారికంగా కరెన్సీ నోట్లలాగా చలామణిలోకి వస్తుంది.


ఇవీ ఆచరణాత్మకమైన శాశ్వత పరిష్కారాలు.......

ఓం ప్రథమం గా   రెండు రాష్ట్రాల్లో తెలుగు భాషకు ప్రత్యేకంగా 

ఒక క్యాబినెట్ స్థాయి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.


తెలుగు భాషకు సంబంధించి సంస్కరణలను ప్రభుత్వం తరఫున తీసుకు రావచ్చు. కానీ దానికంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమం - రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ప్రభుత్వ -  ప్రైవేటు భాగస్వామ్యం లో శాశ్వత ప్రాతిపదికన ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం దీనికి అవసరమయిన మౌలిక వసతులు ఉచితంగా కల్పించాలి. దీని నిర్వహణ ప్రైవేటురంగానికి అప్పచెప్పాలి. (నిర్వహణకు నిధులు కూడా విరాళాలరూపంలో వసూలు చేయవచ్చు) ఐఐఐటి, హైదరాబాదుని...  ప్రభుత్వం, ఐటి పరిశ్రమలు కలిసి నెలకొల్పాయి. చాలా విజయవంతంగా నడుస్తున్నది. 

ఒకవేళ రాజకీయ జోక్యం అనివార్యమయినా, ప్రభుత్వాలు ముందుకు రాకపోయినా ప్రైవేటులోనే దీనిని స్వతంత్ర వ్యవస్థగా ఏర్పాటు చేయవచ్చు. నిధులకు కొరత ఉండదు కూడా. ఎన్నో మాండలికాలు  ఉన్న ఇంగ్లండ్ లో.... బిబిసి... స్వతంత్ర సంస్థ. ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రజలనుండి సేకరించిన నిధులతో పని చేస్తున్నది. దాని భాషా ప్రామాణికతను అక్కడి ప్రభుత్వాలు కూడా అంగీకరిస్తాయి.


స్వతంత్ర వ్యవస్థ ఎలా ఉండాలంటే.....

తెలుగు భాష మాధ్యమంగా నడిచే  ప్రైవేటు రంగ సంస్థలు, నిపుణులు  పత్రికలు, రేడియో, టివీలు, ప్రచురణ సంస్థలు, ముద్రణ సంస్థలు, సినిమా, సోషల్ మీడియా, తెలుగు భాషకోసం ప్రత్యేకంగా ఏర్పడిన విద్యాలయాలు, ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య, వృత్తి విద్య వంటి వాటికి సంబంధించిన సంస్థలకు,  ...  రచయితలు, కవులు, ఉపాధ్యాయుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మండళ్ళు (బోర్డు) ఏర్పాటు చేయాలి. అలాగే దీనికి అనుబంధంగా ఒక సాంకేతిక మండలి ఏర్పాటు చేయాలి. దాని నిర్వహణను ఐఐఐటి హైదరాబాదుకు గానీ, ఐఐటి, హైదరాబాదు కుగానీ, ఎన్.ఐ.టి, వరంగల్ వంటి విద్యాసంస్థలకు గానీ అప్పగించవచ్చు.


మండలి సభ్యుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా ఉండాలి. సభ్యుల పదవీకాలం కనీసం18 నెలలుండాలి, గరిష్టంగా మూడేళ్ళుండాలి. ప్రభుత్వ ప్రతినిధులు(సంబంధిత శాఖ మంత్రి, ప్రధాన/ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి తప్పనిసరిగా ఉండాలి).


ఈ వ్యవస్థ మూడు స్థాయిల్లో పనిచేయాలి. అత్యున్నత స్థాయి, మధ్యమ స్థాయి, కింది స్థాయి. అత్యున్నత స్థాయిలో ఉండేది  తెలుగు సర్వజ్ఞ పీఠం(సుప్రీంకోర్టులాగా), మధ్య స్థాయిలో ఉండేది  సంస్కరణల పీఠం(రాష్ట్ర సచివాలయం లాగా), కింద స్థాయిలో ఉండేది(జిల్లా కలెక్టరు కార్యాలయం లాగా)  పరిశీలన, నిఘా, అమలు పీఠం. ఇది ప్రతి జిల్లాలో ఉండాలి.


సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషులకు (తమిళం, కన్నడలు కూడా అవసరమనుకుంటే తరువాత స్థాయిలో చేర్చవచ్చు)  సంబంధించిన భాషా నిపుణులతో ఉప పీఠాలు ఉండాలి. అనువాదాలకు, రెఫరెన్స్ లకు ఇది తప్పనిసరి. ఇది కూడా సంస్కరణల పీఠం స్థాయిలో దాదాపు అదే హోదాతో ఉండాలి.


అధికార భాషాసంఘం, సాహిత్య అకాడెమీ వంటి పలు రకాల దుకాణాలను రెండు రాష్ట్రాల్లో రద్దు చేయాలి. తెలుగు విశ్వ విద్యాలయాన్ని కూడా రద్దు చేసి దాని ఆస్తులను దీనికి బదలాయించాలి.


తెలుగు పదాల సంస్కరణ

అత్యంత ప్రాధాన్యతా ప్రాతిపదికపై మొదట తెలుగు భాష ప్రమాదంలో పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అదెలాగంటే...


సంస్కరణల పీఠం  ఆధ్వర్యంలో భాషా నిపుణులతో  ఒక  కమిటీ వేయాలి. ప్రతివారం కచ్చితంగా ఇది సమావేశం నిర్వహించాలి.  సమావేశాల మధ్య వారానికి మించి గడువుండకూడదు. అప్పుడే అందరిలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. మార్పులు కూడా ఒక క్రమపద్దతిలో చోటు చేసకుంటాయి. 


సమావేశానికి ముందు - ఆ వారంలో తెలుగులోకి కొత్తగా వచ్చి చేరిన పరభాషా పదాలను కమిటీ కార్యాలయం గుర్తించి ఒక జాబితా తయారు చేసి అజెండా సిద్ధం చేయాలి. వాటి పై వారాంతపు సమావేశం (గుర్తు కోసం దీనిని 1వ సమావేశం అనుకుందాం) సూత్రప్రాయంగా చర్చించాలి. 2వ సమావేశం లోగా సభ్యులందరూ వాటిని అధ్యయనం చేసి వారి వారి సిఫార్సుమేరకు పదాల జాబితాను ఆ సమావేశం ముందుంచాలి. పరభాషా పదానికి కొత్త తెలుగు పదం సృష్టించడం అవసరమనుకుంటే పరిశీలించి సృష్టించాలి. లోగడ తెలుగు సాహిత్యం లో ఇప్పటికే ఉపయోగించి ఉన్న  పాత పదాలను కానీ, సమానార్థకాలను గానీ పరిశీలించాలి.  (రెండవ ) సమావేశంలో - సభ్యులు వ్యక్తిగతంగా  ప్రతి పదానికి సూచించిన కొత్త పదాలను లేదా సమానార్థకాలను వడగట్టి అత్యుత్తమ పదాన్ని ఎంపిక చేయాలి. అలా వడగట్టి ఎంపిక చేసిన పదాల జాబితాను అదే రోజు( సర్వజ్ఞ పీఠంలో సభ్యత్వం ఉన్న) పత్రికలకు, ప్రచురణకర్తలకు, ముద్రణాలయాలకు, రచయితలకు, కవుల సంఘాలకు పంపాలి. వారం రోజుల వ్యవధి ఇచ్చి వారి అభిప్రాయాలు, ఆమోదం తీసుకుని కమిటీ 3వ  సమావేశంలో చర్చించి .. మరింత అవగాహనతో 4వ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలి. (కొన్ని దశాబ్దాల క్రితమే తమిళనాడులో  ఇంచువించు ఇటువంటి పద్ధతినే అక్కడి పత్రికలు విజయవంతంగా అమలు చేసాయి)


ఒకవేళ అభ్యంతరాలు ఎక్కువగా వస్తే వాటిని పెండింగులో ఉంచి మరో సారి సునిశితంగా పరిశీలించాలి.  మిగిలిన వాటిని ...అలా ఆమోదింపబడిన  పదాల జాబితాను అధికారికంగా మంత్రిత్వ శాఖ తరఫున  ప్రభుత్వ, ప్రైవేటురంగంలోని సంబంధిత సంస్థలు, శాఖలు, అన్నింటికీ ప్రభుత్వ ముద్రతో పంపాలి. ఆరోజు నుంచి అదే ఫైనల్. వాటికే గుర్తింపు.


సమాంతరంగా నిఘంటువుల నిర్మాణం చేపట్టాలి. వాటిలో ఈ పదాలను చేరుస్తూ పోవాలి.


ఆ తుది జాబితాలోని పదాలకు బాగా  ప్రచారం కల్పించాలి. పత్రికలు, రచయితలు, ప్రభుత్వ పత్రికా ప్రకటనలు.. ఇలా అన్నిటా.. అందరూ ఆరోజు నుండి ఆ పదాలనే వాడాల్సి ఉంటుంది. అలా వాటికి విస్తృత ప్రచారం కల్పించి వాడకంలోకి తీసుకురావాలి.(కొత్త పదాల జాబితాను వారం వారం పత్రికల్లో ప్రకటించి ప్రజాభిప్రాయం కూడా కోరవచ్చు. కానీ అనవసర కాలయాపన, గందరగోళానికి దారితీయవచ్చు) ఈ జాబితాలోని పదాలపై తదనంతర కాలంలో ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా వాటిని సర్వజ్ఞ పీఠానికి నివేదించాలి. దాని తీర్పే అంతిమం. శిరోధార్యం చేయాలి.


ప్రచారం : తెలుగు పత్రికలన్నీ స్వచ్ఛందంగా ప్రతి సంచికలో (దినపత్రికలయితే ప్రతిరోజూ)  తెలుగు భాషను, వ్యాకరణాన్ని  నేర్పే, మెరుగు పరిచే సమాచారాన్ని నిపుణులచే ఇప్పించేవిధంగా చర్యలు తీసుకోవాలి. అలా చేసిన వాటికే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సౌకర్యాలు వర్తింపచేయాలి.


ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఉద్దేశించిన తెలుగు పుస్తకాలను ప్రభుత్వం అధికారికంగా విద్యాలయాల్లో ప్రవేశపెట్టడానికి ముందు...  భాషాపరంగా, విషయపరంగా  మొదట సంస్కరణల పీఠం సంపూర్ణ ఆమోదం,  తరువాత  అధికార ధృవీకరణ కోసం సర్వజ్ఞ పీఠం ఆమోదం పొందాలి.


సందేహాలు :

Ask Me/Quora నమూనాలో....తెలుగులో భాషకు, వ్యాకరణానికి, ఇతరత్రా సందేహాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్ లైన్ లో నిపుణులతో ఇప్పించడానికి సర్వజ్ఞ పీఠం ఆధ్వర్యంలో, సాంకేతిక పీఠం తోడ్పాటుతో  ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇది నిజానికి ఖర్చు తక్కువ. నిర్వహణ చాలా  సులభం. సాంకేతికంగా సాఫ్ట్ వేర్  చక్కగా పనిచేస్తే చాలు... కాల్ సెంటర్లలో లాగా ఇద్దరు ముగ్గురు సమన్వయ కర్తలుంటే చాలు ( ఫీడ్ బ్యాక్ పెరిగిన తరువాత సిబ్బందిని తదనుగుణంగా పెంచుకోవచ్చు)....తెలుగు భాషా నిపుణులతో ప్యానెల్ ఏర్పాటు చేసుకుని ఉంచుకోవాలి. సందేహం అందిన వెంటనే సమన్వయ కర్తలు దానిని నిపుణులకు పంపి సమాధానాన్ని సేకరించి ఆన్ లైన్ లో ప్రచురిస్తే చాలు.... ఈ వ్యవస్థ బాగా పనిచేస్తే అధికార భాషగా తెలుగును అమలు చేసే క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు, కోర్టులకు, విద్యాలయాలకు...అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.

 

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

…………………………

తెలుగు భాషోద్ధరణకు సంబంధించిన కొన్ని సంస్కరణలు, పరిష్కారాలు, సూచనలు....

 

1.      ఇది నా నూలుపోగు... మరి మీదో....

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_30.html

2.      ఆచరణాత్మక సంస్కరణలు...కొన్ని సిఫార్సులు

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post.html?spref=tw

3.      తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_20.html?spref=tw

4.    ఆలిండియా రేడియోనా ...ఆకాశవాణా...!!!!

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_24.html?spref=tw

5.      అమ్మ ఎలాఉంది? ...హలో !!!  మిమ్మల్నే...అమ్మ ఎలా ఉంది !!! 

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_26.html?spref=tw

6.      అమ్మను వదిలేసి, సవతి తల్లి చంకెక్కబట్టే....

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_99.html?spref=tw

7.      ఉద్యమం అంటే... స్క్రిప్టురాసుకుని సినిమా తీయడం కాదు కదా ! 

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_1.html?spref=tw

8.      మీ ఇంటి నుంచి నేరుగా కబేళాకా....!!!

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_31.html?spref=tw

9.      దీని తల రాతను మీ రాతే మార్చగలదు... !!!

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_2.html?spref=tw

......................................

 

 

 

తెలుగు రాజ్యాల ప్రభువులు

శ్రీ చంద్రబాబు నాయుడు,  శ్రీ రేవంత్ రెడ్డి గార్లకు

బహిరంగ లేఖ


 

అమ్మను పంచుకోకండి

 

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం.. జులై 6, 2024న సమావేశమై ఆస్తిపాస్తుల వాటాల వివాదాలను పరిష్కరించుకోవడానికి నడుంబిగిస్తున్న శుభ ఘడియల్లో....

అనంతకోటి తెలుగు ప్రజల తరఫున సవినయంగా సమర్పించుకుంటున్న విన్నపం...

 

అయ్యలారా !!!!!!!!!!

 

మీరు ఆస్తిపాస్తుల పంపకాల గురించి మాట్లాడుకునే ముందు మన తల్లిభాష ... తెలుగు ఆరోగ్యం గురించి  వాకబు చేయండి. కాటికి కాళ్ళు చాపుకుంటున్న సమయంలో ఆమె ముంగిట వేరు కుంపట్లు వచ్చాయి. అది లోక సహజమే అయినా ఆస్తిపాస్తులన్నీ అనదమ్ములిద్దరూ మీమీ రాజకీయ చతురతతో ఏ పక్షాన్నీ నొప్పించక మీ ఇష్టం వచ్చినట్లు పంచండి.

 

కానీ అమ్మను ముక్కలు చేసి పంచకండి. అమ్మ కట్టుకున్న బట్టలు, పెట్టుకున్న నగానట్రా ఇవి నేను పెట్టినవంటే నేను పెట్టినవని పంతాలకుపోయి ఊడబెరుక్కుపోకండి.

 

ప్రాంతాలు, ఉప ప్రాంతాల్లో కొద్దిపాటి తేడాలున్నా తెలుగు వారందరిదీ ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఆచార వ్యవహారం, ఒకే సంప్రదాయం. ఇవన్నీ తెలుగు వారి ఉమ్మడి ఆస్తి అని   భావించండి.  పంపకాలకు పెట్టకండి. ఉమ్మడిగా కలిసి అనుభవించడం ద్వారా మాత్రమే తెలుగు వెలుగుతుంది. సంస్కృతి మరింత ప్రభవిస్తుంది.

 

అందువల్ల దయచేసి వీటి తాలూకు వేదికలయిన విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు, పురావస్తు భాండాగారాలు, అకాడమీలు, భాషా సంఘాలు, సాంస్కృతిక సంఘాలు... తదితరాలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి ఏం చేయాలో చర్చించండి. అలాగే దీన్ని చర్చకు పెట్టండి.

 

నిజానికి మాతృభూములు ఇవే అయినా ఈ రోజున ప్రపంచ దేశాలన్నింటా తెలుగువాళ్లు జెండాలు ఎగరేస్తున్నారు. జన్మభూమినుంచి ఎటువంటి ప్రోత్సాహం అందకపోయినా.. తెలుగు వాళ్లమని గర్విస్తూ ప్రవాసాంధ్రులు  మాతృభూమికంటే మిన్నగా భాషాసంస్కృతుల పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తూ వాటిని బతికించడానికి నానాపాట్లు పడుతున్నారు.. వీరి సంఖ్య కోట్లల్లోనే ఉంది.(350 విదేశీ భాషలున్న ఒక్క అమెరికాలోనే తెలుగువారు 11వ స్థానంలో, కేవలం భారతీయ భాషలనే తీసుకుంటే తెలుగువారు 3వ స్థానంలో వెలిగిపోతున్నారు అక్కడ )

 

అందువల్ల అందరి అభిప్రాయాలు సేకరించి, రెండు తెలుగు రాష్ట్రాల భాషా నిపుణులకు, ప్రవాసాంధ్రులకు సముచిత  ప్రాతినిధ్యం, ఇతర ప్రోత్సాహకాలతో ఉమ్మడి వేదికల దిశగా అడుగులు వేయండి. తక్షణ పరిశీలనపట్ల ఆసక్తి ఉంటే దీనికి సంబంధించిన విశ్లేషణలు, సూచనల లింక్ లు కింద ఇస్తున్నాను. తెలుగు భాషాభిమానులందరి అభిప్రాయాలు అందేవరకు వీటిని పరిశీలించి ... చివరగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను అందించి తెలుగు భాషాసంస్కృతులు  మరో వెయ్యేళ్ళు వర్దిల్లేలా  శాశ్వత పరిష్కారాలు చూపండి.

 

ఇట్లు

ములుగు రాజేశ్వర రావు,

సీనియర్ జర్నలిస్టు

................

మనవి :

సామాజిక మాధ్యమాలలోని మిత్రులకు, తెలుగు భాషాభిమానులకు, భాషా నిపుణులకు ఒక మనవి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే వీలయినంత మందిని ఈ దిశగా కదిలించండి, అధినాయకుల్లో, వారి ప్రభుత్వాల్లో  కదలిక వచ్చేవరకూ....

.....

 

తెలుగు భాషోద్ధరణకు సంబంధించిన కొన్ని సంస్కరణలు, పరిష్కారాలు, సూచనలు....

 

1.      ఇది నా నూలుపోగు... మరి మీదో....

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_30.html

2.      ఆచరణాత్మక సంస్కరణలు...కొన్ని సిఫార్సులు

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post.html?spref=tw

3.      తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_20.html?spref=tw

4.    ఆలిండియా రేడియోనా ...ఆకాశవాణా...!!!!

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_24.html?spref=tw

5.      అమ్మ ఎలాఉంది? ...హలో !!!  మిమ్మల్నే...అమ్మ ఎలా ఉంది !!! 

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_26.html?spref=tw

6.      అమ్మను వదిలేసి, సవతి తల్లి చంకెక్కబట్టే....

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_99.html?spref=tw

7.      ఉద్యమం అంటే... స్క్రిప్టురాసుకుని సినిమా తీయడం కాదు కదా ! 

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_1.html?spref=tw

8.      మీ ఇంటి నుంచి నేరుగా కబేళాకా....!!!

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_31.html?spref=tw

9.      దీని తల రాతను మీ రాతే మార్చగలదు... !!!

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_2.html?spref=tw

......................................

 

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...